బాపు దర్శకత్వంలో జూ: ఎన్టీఆర్? PDF Print E-mail
(average 5.00 out of 5)

అలనాటి మేటి సినిమా “లవకుశ” చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయడానికి ప్రముఖ సీనియర్ దర్శకులు బాపు సన్నద్ధమవుతున్నారు. చెన్నైకి చెందిన ఒకాయన ఈ చిత్రాన్ని నిర్మిస్తారని, యంగ్ టైగర్ జూ: ఎన్టీఆర్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తాడని తెలిసింది

ప్రస్తుతం ఎన్టీఆర్ “బృందావనం”, “శక్తి ” చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు అయిపోతూనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా మొదలుకానుంది. ఈ మూడు చిత్రాలు అయిన తరువాత బాపు దర్శకత్వంలో “లవకుశ” రీమేక్ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది.
తను వేసే బొమ్మల్లాగే తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను అందమైన కావ్యాలుగా తెరకెక్కించడంలో బాపుది అందె వేసిన చెయ్యి. అటు క్లాసు, ఇటు మాసు.. మాత్రమే కాకుండా పౌరాణిక పాత్రల్లో కూడా ఇట్టే ఒదిగిపోయే నేర్పుని తాత స్వర్గీయ ఎన్టీఆర్ దెగ్గరినుండి పుణికిపుచ్చుకున్న సమర్ధుడు జూ: ఎన్టీఆర్. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా మరొక ఆణిముత్యం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు…. ఎనీ డౌట్స్?

Source:maastars.com



Add this page to your favorite Social Bookmarking websites